రంగాపురం అనే గ్రామంలో వెంకటేశ్వరస్వామి ఆలయం ఉండేది. ఆ ఆలయ గోపురం మీద ఒక పావురాల జంట అన్యోన్యంగా ఉండేవి. ఆహారం కోసం వెళ్ళినా, విహారానికి వెళ్ళినా అవి కలిసే వెళ్ళేవి. వాటికి ఎప్పుడూ ఆహారానికి కొదవ ఉండేది కాదు. ఆలయంలో భక్తులు నివేదన చేసి వదిలి వెళ్ళిన రకరకాల ప్రసాదాలను తిని, చీకూ చింత లేకుండా ఆనందంగా ఉండేవి. మగ పావురం బాగా కండపట్టి లావుగా తయారయ్యింది. ఈ పావురాల జంటను భక్షించాలని ఒక డేగ పన్నాగం పన్నింది. అది ఆలయ గోపురం మీద వాలింది. ఏదో ఒక పావురాన్ని తన్నుకు పోవాలని దాని ఆశ. పగలు గుడి ఆవరణంతా భక్తులతో నిండి ఉండటంతో డేగ ఎత్తు పారలేదు. ఆడ పావురం భర్తతో “ఆ డేగ పగలంతా మన కోసమే చూసింది. మనం ఇక్కడ నుంచి వేరే చోటికి వెళ్ళిపొతే మంచిది” అని చెప్పింది. అప్పుడు మగ పావురం పారిపోవడం పిరికివాని లక్షణం అంది. అది క్రూరమైన పక్షి. మనం ఎలా పోరాడగలం? ఆందోళనగా అంది అడపావురం. చూస్తూ ఉండు ఆ డేగాతో ఎలా పోరాడతానో అంది ధైర్యంగా మగపావురం. కొన్ని రోజులు గడిచాయి. ఆ పావురాల జంట ఆహారం తినడానికి గుడి ఆవరణలోకి వెళ్ళింది. ఆ రోజు సూర్య గ్రహణం కావటంతో ఆలయంలో భక్తులు లేరు. ఇంతలో డేగ వేగంగా వచ్చింది. గురి చూసి మగపావురాన్ని గోళ్ళతో పట్టుకుని తన్నుకు పోయింది. మగ పావురం డేగాతో పోరాడటానికి ప్రయత్నించింది. అది చూసి అటుగా వచ్చిన ఆలయ పూజారి డేగ మీదకు రాయిని విసిరాడు. దాంతో డేగ పావురాన్ని వదిలి పారిపాయింది. ఆ తర్వాత ఆ....... ఇక అక్కడ వుండడం క్షేమం కాదని పావురాలు రెండూ మరో చోటు చూసుకున్నాయి. నీతి: అపాయం వచ్చినప్పుడు కుంగిపోకుండా పరిస్దితులను ఎదుర్కొని ధైర్యంగా పోరాడటం బుద్ధిమంతుల లక్షణం ఆధారం: జి. సురేశ్